పరకాలలో మేం పోటీ చేస్తాం: కెసిఆర్తో నారాయణ
పరకాలలో తాము పోటీ చేస్తామని తెరాస ఇటీవలే ప్రకటించింది. నాయని నర్సింహా రెడ్డి నేతృత్వంలోని పార్టీ ఎన్నికల కమిటీ అభ్యర్థిని ఖరారు చేయడానికి మంతనాలు కూడా జరుపుతోంది. ఈ స్థితిలో నారాయణ కెసిఆర్తో మాట్లాడారు. భవిష్యత్తులో సిపిఐతో పొత్తు పెట్టుకునేది తామేనని, అందువల్ల ఈసారికి ఆ సీటును తమకు వదలాలని ఆయనతో కెసిఆర్ అన్నారు.
గత ఉప ఎన్నికల్లో సిపిఐ తెరాసకు మద్దతు ప్రకటించింది. పరకాలలో తెరాస లేదా సిపిఐ పనిచేయాలని, ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే బిజెపి ప్రయోజనం కలుగుతుందని, బిజెపిని కట్టడి చేయడానికి అవగాహన అవసరమని నారాయణ కెసిఆర్తో అన్నట్లు సమాచారం. మహబూబ్నగర్ ఉప ఎన్నికలో తెరాసతో పాటు బిజెపి కూడా పోటీ చేసింది. బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి చేతిలో తెరాస అభ్యర్థి ఓడిపోయారు. ఆ పరిస్థితి రాకూడదంటే సిపిఐ, తెరాస అవగాహనతో పనిచేయాలనే చర్చనువ నారాయణ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది.
సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. బిజెపి కూడా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే, తెరాసతో విభేదాలతో ఆ పార్టీని తెలంగాణలో ఢీకొనడానికి బిజెపి సిద్ధపడింది. ఈ సమయంలోనే సిపిఐ తెరాసకు దగ్గర కావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో పరకాల మాత్రమే తెలంగాణలో ఉంది.