Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పరిటాల హంతకులతో: జగన్‌పై వీరశివా సంచలన వ్యాఖ్య

Veera Siva Reddy
కడప: కాంగ్రెసు పార్టీ కమలాపురం సీనియర్ శాసనసభ్యుడు వీర శివా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర, మద్దెలచెర్వు సూరి హత్యల కేసులలోని నిందితులతో వైయస్ జగన్‌కు సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెరాసతో కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. సమైక్యవాదులు ఈ విషయాన్ని గుర్తించాలని వీర శివా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికలలో జగన్‌కు ఓటు వేయవద్దన్నారు. కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమన్నారు.

కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తనకు మంగళి కృష్ణతో పరిచయం ఉందని భాను విచారణలో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయ. మంగళి కృష్ణతో జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇరువురిది పులివెందులేనని, మొదటి నుండి జగన్‌కు బ్యాక్ బోన్‌గా కృష్ణ ఉన్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్‌పై వీర శివా రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కెసిఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యాడని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ పలుమార్లు ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తే రాష్ట్ర విభజనకు దారి తీసినట్లేనని, ఆయన రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తున్నాడని టిజి పలుమార్లు మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+