పెరుగుతున్న వలసలు: జగన్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం శుక్రవారం పుచ్చుకున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ గ్రంథి శ్రీనివాస్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లక్షణాలన తాను వైయస్ జగన్లో చూశానని చెప్పారు. అందుకే తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు ప్రసాద రాజు, బాలరాజు తదితరులు హాజరయ్యారు. కాగా గ్రంథి శ్రీనివాస్ 2004 నుండి 2009 వరకు భీమవరం ఎమ్మెల్యేగా పని చేశారు.
కాగా చిన్న వయస్సులోనే వైయస్ జగన్కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆళ్లగడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. ఆమె కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపిలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications