వల్లభనేని వంశీ, జగన్ల కలయికను తప్పుపట్టిన చమన్

వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తనను చాలా బాధించిందన్నారు. తననే కాదు పరిటాల అభిమానులను అందరిని వేధించిందని అన్నారు. రవి హత్యలో ఎవరెవరున్నారు, ఎవరెవరి పాత్ర ఎంత ఉందో కోర్టులో తేలుతుందని ఆయన చెప్పారు.
వల్లభనేని వంశీ తన కుమారుడికి పరిటాల రవి పేరు పెట్టుకొని జగన్ను కలవడం సరికాదన్నారు. డిజిపి తన ప్రాణానికి రక్షణ కల్పిస్తానని హామీ ఇవ్వడం వల్లనే తాను లొంగిపోయానని ఆయన చెప్పారు. పరిటాల రవి అనుచరుడు అయిన చమన్ ఆయన హత్య తర్వాత కొంతకాలం అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత లొంగిపోయాడు.
కాగా రెండు రోజుల క్రితం విజయవాడలో వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. వీరి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కలిగించింది. తెలుగుదేశం పార్టీ వంశీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై చమన్ గుంటూరులో స్పందించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications