తెలంగాణపై మేం లేఖ ఇచ్చాం: లోకసభలో నామా

తెలంగాణపై కేంద్ర వైఖరి ఏమిటో, కాంగ్రెసు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనవల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, తెలంగాణ సమస్యను నాన్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో తేల్చి చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని తేల్చకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో నామా నాగేశ్వర రావు కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిశారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
తమ పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య సంఘటనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర ఉందని నామా నాగేశ్వర రావు లోకసభలో ఆరోపించారు. ఈ విషయంపై గతంలో సిబిఐ దర్యాప్తు చేసిందని, అయితే అప్పుడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేసు నుంచి తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తప్పించారని ఆయన అన్నారు. వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications