మీడియా వార్తలపై గుర్రుమన్న మంత్రి మోపిదేవి

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో తనపై వచ్చిన మీడియా వార్తలపై ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మీడియా రాస్తున్న వార్తలు బాధాకరమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సిబిఐ తనను విచారణకు పిలువలేదని ఆయన చెప్పారు. వాన్‌పిక్ అనుమతుల విషయంలో తనను విచారణకు సిబిఐ పిలువలేదని ఆయన స్పష్టం చేశారు.

తన అరెస్టే తరువాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవన్నీ అసత్య కథనాలని ఆయన అన్నారు. తనకు సిబిఐ నుంచి ఏ విధమైన సమాచారం లేదని ఆయన చెప్పారు. మీడియాలో దీనిపై వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. సిబిఐ ముందు తాను ఇది వరకు ఓసారి హాజరయ్యారని, పిలిస్తే మళ్లీ వెళ్తానని ఆయన చెప్పారు.

వాన్‌పిక్ వ్యవహారంలో తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. దీనిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. సిబిఐకి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. వాన్‌పిక్ వ్యవహారంలో మోపిదేవి వెంకటరమణ నేడో రేపో సిబిఐ చేత అరెస్టవుతారంటూ సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

మోపిదేవి వెంకటరమణ సోమవారం సిబిఐ ముందు హాజరవుతారని, ఆయనను సిబిఐ ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చునని సోమవారం వార్తలు వచ్చాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌కు ఆమోదం ఇవ్వడంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక, న్యాయ శాఖల సలహాలను కూడా ఆయన బేఖాతరు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+