విజయమ్మ, షర్మిళ బ్యాగులు రెండుసార్లు తనిఖీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పోలీసులను నిలదీశారు. వాగ్వాదానికి దిగారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్దేశ్య పూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తోందని, ఇందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు తదితరుల వాహనాలను ఎందుకు చెక్ చేయడం లేదని వారు ప్రశ్నించారు. కాగా రోజూ వారి చర్యల్లో భాగంగానే తాము విజయలక్ష్మి బ్యాగేజిని చెక్ చేశాకమని డిఎస్పీ చెప్పారు.
చెక్కింగులో తమకు ఏమీ లభించలేదని, దీంతో వారిని ముందుకు సాగేందుకు అనుమతించామని చెప్పారు. కాగా తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి బ్యాగేజ్ తనిఖీ వెనుక కుట్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు ఆరోపించింది. విజయమ్మ, షర్మిల బ్యాగేజ్లను పలు చెక్ పాయింట్ల వద్ద తనిఖీ చేస్తున్నారని, మహిళా పోలీసులు చెక్ చేయడం లేదని వారు ఆరోపించారు. గురువారం, శుక్రవారం వరుసగా రెండు రోజులు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలి బ్యాగులు తనిఖీ చేశారన్నారు.
అదే సమయంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్లలో తనిఖీలే చేయలేదన్నారు. విజయమ్మ లగేజ్ని మొదట రామచంద్రాపురం బైపాస్ రోడ్డులోని కొంగోడు చెక్ పోస్టు వద్ద, ఆ తర్వాత శుక్రవారం దిండి వద్ద చెక్ చేశారని ఆరోపించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications