'గాలి'కి బెయిల్ కేసు: పట్టాభిరామారావ్ అరెస్ట్, విచారణ

అతనిని అక్కడి నుండి నేరుగా మొజాంజాహీ మార్కెట్ వద్దనున్న ఎసిబి కార్యాలయానికి తీసుకు వచ్చారు. అక్కడ ఆయనను విచారిస్తున్నారు. బెయిల్ ఫర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు, ఎలా డబ్బులు తీసుకున్నారు, మొత్తం ఇచ్చింది ఎంత తదితర అంశాలపై పట్టాభి రామా రావు నుండి ఎసిబి అధికారులు కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో ఇప్పటికే రిటైర్డ్ జడ్జి చలపతి రావు, పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను ఎసిబి గతంలోనే అరెస్టు చేసింది.
కాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి టి. పట్టాభి రామారావుపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు గురువారం ఆయనను సస్పెండ్ చేసింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలి జనార్దన్ రెడ్డికి హైదరాబాదులోని సిబిఐ కేసుల మొదటి అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టి. పట్టాభి రామారావు మే 12వ తేదీన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రావడంతో సిబిఐ ఫిర్యాదు మేరకు హైకోర్టు పట్టాభిరామారావును సస్సెండ్ చేసింది. న్యాయమూర్తికి చెందిన బ్యాంకు లాకర్లను కూడా సోదా చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కనుగొన్నారు. సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలైనా కాకమునుపే పట్టాభి రామారావు అవినీతి బాగోతం బయటపడడం గమనార్హం.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications