గుజరాత్, ఆస్ట్రేలియాలో స్వల్ప భూప్రకంపనలు

Mild earthquake of 5.1 in richter scale rocks Gujarat
అహ్మదాబాద్/మెల్‌బోర్న్: గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం ఉదయం వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పైన 5.1గా నమోదయింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమీ జరగలేదని తెలుస్తోంది. గుజరాత్‌లో బుధవారం ఉదయం 1.44 గంటలకు స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు సంబంధిత శాఖ అధికారులు చెప్పారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బావనగర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, అహ్మదాబాదులలో ప్రకంపనలు వచ్చాయని చెప్పారు.

మరోవైపు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ సమీపంలోనూ భూమి కంపించింది. మంగళవారం ఆస్ట్రేలియాలో వచ్చిన భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పైన 5.2గా నమోదయింది. మెల్‌బోర్న్‌కు 121 దూరంలో ఇవి వచ్చాయి. యూఎస్ జియాలజికల్ సర్వే వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటలకు భూమిలో తొమ్మిది కిలోమీటర్ల లోతు నుండి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

మో పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో భూప్రకంప కేంద్రాన్ని గుర్తించారు. కిల్‌మోర్, గిప్స్‌లాండ్, డ్రాయిన్, రౌవిల్లే, మెల్‌బోర్న్‌ పట్టణంలోని ప్రజలు దాదాపు 30 నుండి 40 సెకన్ల పాటు భూమి కంపించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియరాలేదు. సునామీ ప్రభావం లేకపోవడం మంచి ఉపశమనమని ఆస్ట్రేలియన్ సునామీ హెచ్చరికల సంఘం ప్రకటించింది.

ఆస్ట్రేలియా మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. భూప్రకంపనలు వచ్చిన పలు నగరాలలోని ఇళ్లలో ప్రకంపనలు కనిపించాయి. భవనాలు, గోడలు కూడా కాస్త కంపించాయి. దీంతో ప్రజలు భూకంపం వచ్చిందని భావించి బయటకు వచ్చారు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం గుంటూరు, కృష్ణా, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+