భాను కిరణ్కు వ్యతిరేకంగా నిర్మాత వాంగ్మూలం
ప్రసన్న కుమార్తో పాటు మహంకాళీ సినిమా నిర్మాత వై. సురేందర్ రెడ్డి కూడా సిఐడి అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రముఖ సినీ నిర్మాత సి. కళ్యాణ్కు చెందిన బాలాజీ ల్యాబ్లో జరిగిన ఆర్థిక వివాదాల సెటిల్మెంట్లలో భాను కిరణ్ పాత్రపై వారు సిఐడి అధికారులకు వివరించినట్లు చెబుతున్నారు. బాలాజీ ల్యాబ్లో మరో నిర్మాత నట్టి కుమార్ను సి. కళ్యాణ్, భాను కిరణ్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
సినీ ఫైనాన్షియర్స్కు, నిర్మాతలకు మధ్య తలెత్తిన పలు వివాదాల్లో భాను కిరణ్ జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినీ నిర్మాతలు సింగనమల రమేష్, సి. కళ్యాణ్లపై, ఆంజనేయులు గుప్తాపై సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. భాను కిరణ్తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల మీద వారిపై సిఐడి కేసులు నమోదు చేసింది.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడి వారిపై కేసులు నమోదు చేసింది. సి. కళ్యాణ్పై నిర్మాత నట్టి కుమార్ సిఐడికి ఫిర్యాదు చేశారు. నట్టి కుమార్ ఈ వ్యవహారంలో సిఐడి ముందు కూడా హాజరయ్యారు. సి కల్యాణ్, శింగనమల రమేష్, వ్యాపారవేత్త ఆంజనేయ గుప్తా ముందస్తు బెయిల్ కోసం బుధవారం కోర్టును ఆశ్రయించారు. సినీ నిర్మాత నట్టి కుమార్ తమపై సిఐడికి తప్పుడు ఫిర్యాదు చేశారని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.