జగన్ ఎమ్మెల్యేల ఫైట్ ప్రారంభం: మద్యంపై భూమన దీక్ష

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలన్నదే తన డిమాండ్ అన్నారు. ప్రపంచంలోని వంద కోట్ల హిందువులకు తిరుపతి ఆధ్యాత్మిక నగరం అని, హిందువుల మనోభావాలు గౌరవించాలంటే మద్యరహిత నగరంగా మార్చాలన్నారు. తాను ఉప ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వెళ్లినప్పుడు చాలామంది మహిళల నుండి అందిన ఫిర్యాదుల మేరకే తాను దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.
భూమన కరుణాకర్ రెడ్డి దీక్షకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. దీక్షా ప్రారంభ సమయంలో తరలి వచ్చిన మహిళలు మద్యం బాటిళ్లను పగుల గొట్టి తమ నిరసనను వ్యక్తపరిచారు. తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా తన నిరసన దీక్షను చేపట్టారు.
కాగా సోమవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లను చేపట్టనుంది. ఇలాంటి సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి నిరసన దీక్షను చేపట్టడం అధికార పార్టీలో కలవరం రేపుతోంది. అయితే నిబంధనల ప్రకారం ఇప్పటికే తిరుమలకు సమీపంలో మద్యం దుకాణాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అయినప్పటికీ భూమన దీక్ష చేపట్టడం రాజకీయ లబ్ధి కోసమే అని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications