జగన్లాగే వైయస్ విజయమ్మను అడ్డుకుంటాం: కెటిఆర్

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే జగన్కు ఎదురైన అనుభవమే విజయమ్మకు ఎదురవుతుందన్నారు. సిరిసిల్లలో కంటే చీరాల, ధర్మవరంలలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని విజయమ్మకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఆందోళన చేపట్టాలన్నారు. చేనేత కార్మికులపై ఆమె మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు వైయస్ చెప్పింది కొండంత అయితే చేసింది గోరంత అన్నారు ఆయన సైంధవ పాత్ర పోషించారని మండిపడ్డారు.
మరోవైపు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్కు మరోసారి తెలంగాణవాదుల నుండి చుక్కెదురయింది. తెలంగాణ కోసం ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పరకాల కూడా వచ్చారు. పరకాల మాట్లాడేటప్పుడు తెలంగాణవాదులు ఆయనకు, విశాలాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. విశాలాంధ్ర నేతలు కరపత్రాలు పంచే ప్రయత్నాలు చేశారు. దీనిని కూడా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో చేసేది లేక పరకాల ప్రభాకర్ సమావేశం నుండి బయటకు వెళ్లారు. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications