నా కూతుళ్లకు అప్పుడే అగాథా, క్లిస్టినాలని పెట్టా: సంగ్మా

PA Sangma
భువనేశ్వర్: బ్రిటిష్ దేశానికి చెందిన ప్రముఖ నవలా రచయిత అగాథా క్రిష్టీకి చెందిన ఓ పుస్తకాన్ని బిజూ పట్నాయక్ తనకు బహూకరించిన తర్వాతనే తన కూతుళ్ల పేర్లను అగాథా, క్రిస్టీగా తాను పెట్టానని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి పిఏ సంగ్మా ఆదివారం అన్నారు. తాను 1977లో తొలిసారి బిజూ పట్నాయక్‌ను కలిశానని చెప్పారు. అప్పుడు అతను తనకు అగాథా క్రిస్టీకి చెందిన ఓ పుస్తకాన్ని ఇచ్చారన్నారు.

అప్పుడే తన కూతుళ్లకు ఆ పేర్లు పెట్టానని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రచారంలో భాగంగా పిఏ సంగ్మా ఆదివారం బిజూ జనతా దళ్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతివ్వాలని బిజెడి ప్రజాప్రతినిధులను కోరారు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉండగా అతనితో సాన్నిహిత్యం ఉండేదన్నారు. ఆయన తనయుడు నవీన్ పట్నాయక్‌ను కూడా పిఏ సంగ్మా పొగడ్తలతో ముంచెత్తారు.

కాగా సంగ్మా పెద్ద కూతురు అగాథా సంగ్మా కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆతని చిన్న కూతురు క్రిస్టినా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సంగ్మాకు ఇద్దరు తనయులు. బిజూ పట్నాయక్ ఇండోనేషియా అధ్యక్షురాలు మేఘావతి సుకర్నోపుత్రి పేరును కూడా పెట్టారు. గతంలో బిజూ పట్నాయక్ సుకర్నో పుత్రికను రక్షించారు. దీంతో అతను తన కూతురుకు పేరు పెట్టాలని బిజూను కోరారు.

కాగా పిఏ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికలలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పలు పార్టీలను, నేతలను కలుస్తూ మద్దతు నిలవాల్సిందిగా కోరుతున్నారు. ఈ నెల 19వ తేదిన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. యుపిఏ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ రంగంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+