ఇళ్లలో దోచి 8 మంది బాయ్ఫ్రెండ్స్తో పనిమనిషి జల్సా

పని చేస్తానని చేరి పదమూడు ఇళ్లను దోచుకోవడమే కాకుండా తనకున్న ఎనిమిది మంది బాయ్ఫ్రెండ్స్తో జల్సా చేసేది ఈ అనిత శైలేంద్ర గైక్వాడ్ అనే పనిమనిషి. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సవిత, సంగీత, సుమన్, లక్ష్మి వంటి వేర్వేరు పేర్లతో చేరిన మొదటి రోజే విలువైన వస్తువులతో అనిత పరారయ్యేది.
ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలోనే జూన్ 19న, జూలై 4న రెండు ఇళ్లలో పది లక్షల రూపాయల విలువైన నగలు చోరీ చేసిందని ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఎవరింట్లో పనిమనిషి అవసరం ఉందో అని అక్కడి వాచ్మెన్ల ద్వారా అనిత తెలుసుకునేది.
ఆ ఇంటికి వెళ్లి పని చేస్తానని యజమానులతో మాట్లాడుకుని చేరిన మొదటిరోజే అందుబాటులో ఉన్న విలువైన వస్తువులను చేజిక్కించుకొని పరారయ్యేదని పోలీసులు తెలిపారు. వాటిని తన ప్రాంతంలోని వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బును తనకున్న ఎనిమిది మంది బాయ్ఫ్రెండ్స్తో జల్సా చేసేదట. అయితే ఒక ఇంటి నుంచి వస్తున్న అనితను అక్కడి సిసి టివి ఫుటేజ్ల ద్వారా పోలీసులు గమనించారు.
దాంతో గతంలో ఆమెపై గల కేసుల ఆధారంతో అనితను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి అయిదు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దోపిడీల్లో ఆమెకు ఆ ఎనిమిది మంది బాయ్ఫ్రెండ్స్ సహకరించారా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications