సెప్టెంబర్లో తెస్తారా: కెసిఆర్కు కొండా సురేఖ డెడ్ లైన్

టిఆర్ఎస్ నాయకులు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను అడ్డుకోవడంలో చూపించిన శ్రద్ధ, ప్రయత్నంలో పదో వంతు చేసినా సిరిసిల్ల నేతన్నల సమస్యలు తీరేవి అన్నారు. 2014 ఎన్నికలలో తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అధికార కాంగ్రెసు సమస్యల పరిష్కారంలో విఫలమైందని, ప్రతిపక్ష తెలుగుదేశం కాంగ్రెసుతో కుమ్మక్కైందని, తెరాస పదేళ్లుగా తెలంగాణ తీసుకు వస్తామని ప్రజలను మభ్య పెట్టిందని.. ఇలా అన్ని పార్టీలు విఫలమైన సమయంలో అందరూ వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారని అన్నారు.
ఏదో ఒక కారణం చూపి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు తెరాస చేస్తోందన్నారు. పరకాలలో చావు తప్పి కన్నులొట్ట పోయిన చందంగా గెలిచిందన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విజయమ్మ దీక్ష చేస్తుంటే కెటిఆర్ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అదే కెటిఆర్ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు.
తమపై టిఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడి వారి తల్లులు, సోదరుల మీద కూడా దాడి చేసినట్లే అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే టిఆర్ఎస్ వైయస్సార్ కాంగ్రెసుపై దాడికి పాల్పడుతోందన్నారు. టిఆర్ఎస్తో తెలంగాణ రాదని ప్రజలకు తెలిసి పోయిందన్నారు. సెప్టెంబర్ 15వ తేది లోగా తెలంగాణ రాకుంటే కెసిఆర్ ఏం చేస్తారో చెప్పాలని సవాల్ చేశారు. 2014లో టిఆర్ఎస్కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. టిఆర్ఎస్తో తెలంగాణ రాదని తేలిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications