విజయమ్మ 20నిమిషాల్లో ముగించారు: కవిత ఎద్దేవా

20 నిమిషాల్లో ముగించిన విజయమ్మ దీక్షతో చేనేత కార్మికులకు ఒరిగిందేమిటో తెలియడం లేదన్నారు. చేనేత కార్మికుల సమస్యల కంటే తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జపమే ఎక్కువగా ఉందన్నారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వరకు కొనసాగిన యాత్రలో అడుగడుగునా చెప్పులు చూపినా, రాళ్ల రువ్వినా యాత్రను కొనసాగించడం వీరత్వం, ధీరత్వం కాదని, అది సిగ్గుమాలిన చర్య అని కవిత ధ్వజమెత్తారు.
ఖమ్మం జిల్లాలోని 300 గ్రామాలు ముంపునకు గురయ్యే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైయస్సార్ కాంగ్రెసు వైఖరి ఏమిటో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications