ఫెరా కేసు: కోర్టులో మంత్రి పార్థసారథికి చుక్కెదురు
అయితే... తాను ఉద్దేశ పూర్వకంగా తప్పు చేయలేదని, పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు గడువు ఇవ్వాలని ఆయన కోరడంతో.... శిక్ష అమలును నెల రోజులపాటు నిలిపి వేసింది. జరిమానా మాత్రం చెల్లించాలని పేర్కొంది. దీంతో... కంపెనీకి, తనకు వ్యక్తిగతంగా విధించిన రూ.5.25 లక్షల జరిమానాను మంత్రి అప్పటికప్పుడు చెల్లించారు. అనంతరం ఎంఎస్జే కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
ఆ కేసును విచారణకు స్వీకరించిన ఎంఎస్జె కింది కోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఆదేశాలిచ్చింది. ఇది తాము ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఆ సందర్భంగా మంత్రి మరో పిటిషన్ వేశారు. ఆర్థిక నేరాల కోర్టు తనకు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పూర్తిగా నిలిపివేయాలని... లేదా రద్దు చేయాలని కోరారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్థిక నేరాల కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా నిలిపివేయడానికి నిరాకరిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో శిక్షను రద్దు చేయాల్సిందిగా పైకోర్టుకు మంత్రి వెళ్లనున్నారని తెలుస్తోంది.