ధర్మానకు అండ: బొత్స, రాజీనామా వద్దు.. రఘువీరా
సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీట్లోని వివరాలు చూశాక ధర్మాన రాజీనామాపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేసిన వారు ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసినప్పుడు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని బొత్స ప్రశ్నించారు. విద్యుత్ కోతల విషయంలో ట్రాన్సుకో అధికారులను తప్పుపట్టవద్దని బొత్స వేరుగా విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో సూచించారు.
విద్యుత్ కోతల విషయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. నిర్వహణా లోపం ఉంటే అధికారులను నిలదీయాలని సూచించారు.
ధర్మానకు రఘువీరా మద్దతు
ధర్మానకు మంత్రి రఘువీరా రెడ్డి మద్దతు పలికారు. వైయస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని మంత్రివర్గ సమష్టి నిర్ణయాలే అన్నారు. ధర్మాన నిబద్ధత కలిగిన నేత అని, ఆయన ఏ తప్పు చేయలేదన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదన్నారు.
సిఎంను కలిసిన శ్రీకాకుళం జిల్లా నేతలు
శ్రీకాకుళం జిల్లా నేతలు పలువురు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ధర్మాన రాజీనామాను ఆమోదించ వద్దని, ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నేత అని, ఆయన ఏ తప్పు చేయరని వారు సిఎంతో చెప్పారు. ఆయనను మంత్రివర్గంలో అలాగే కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు.