ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్బంధించి ప్రియుడి ముందే ప్రియురాలి అత్యాచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantapur Map
అనంతపురం/గుంటూరు: అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం జరిగింది. నలుగురు దుండగులు ఓ ప్రేమ జంటను బంధించారు. ప్రియుడిని కట్టివేసి అతని ముందే ప్రియురాలిపై ఆ దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో డిఎస్పీ కానిస్టేబుల్‌తో సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో పేకాట క్లబ్ పైన దాడి

గుంటూరు జిల్లాలో ఓ పేకాడ క్లబ్ పైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గుంటూరులోని పెదపలకలూరు రోడ్డులోని ఈ క్లబ్ పైన పోలీసులు దాడులు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలోనూ పోలీసులు పదిమంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుండి 16బైక్స్, రూ.90వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

డిఈవోపై ఉపాధ్యాయురాలు ఫిర్యాదు

కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి మానసిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బదలీ విషయంలో డిఈవో అమర్యాదగా ప్రవర్తించారని మూడో పట్టణ పోలీసులను ఆమె ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

మహిళా హోంగార్డుల ఫిర్యాదు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి సబ్ జైలు సూపరిండెంట్ మధుబాబు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఇద్దరు మహిళా హోంగార్డులు డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వారికి హామీ ఇచ్చారు.

English summary

 Four persons arrested by Raptadu of Ananthapur district police on Sunday for torchering young girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X