కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా రైతులపై కర్నాటక రైతుల దౌర్జన్యం, ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karnataka Farmers prevent Water release
కర్నూలు: కర్నాటక రైతులు ఆంధ్రా రైతులపై మళ్లీ దౌర్జన్యానికి దిగారు. తుంగభద్ర ఎల్ఎల్‌సి 33వ డిసి వద్ద మొత్తం ఆరు గేట్లలో ఐదు గేట్లను మూసివేసి నీటిని తమ రాష్ట్రం వైపునకు మళ్లించారు కర్నాటక రైతులు. ఇది బళ్లారి జిల్లా మోకా తాలుకా బీడివల్లి సమీపంలో ఉంది. కర్నాటక రైతులు అర్ధరాత్రి పూట ఐదు గేట్లను మూసి వేశారు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా దారి మళ్లించడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

తుంగభద్ర ఎల్ఎల్‌సి కింద మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోనీ, కోడుమూరు నియోజకవర్గాల ఆయకట్టు ఉంది. ఇందుకోసం 725 క్యూసెక్కుల విడుదల చేయాల్సి ఉండగా 151 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇప్పటి వరకు విడుదలైంది. నీటి మళ్లింపుతో 192 గ్రామాలకు తాగునీరు, 43 వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతాయి. అయితే గేట్లు మూసి వేసిన విషయం తెలుసుకున్న మన రైతులు అక్కడకు వెళ్లి గేట్లు తెరిచే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.

ఆదివారం రోజు కూడా కర్నాటక రైతులు నీటిని అక్రమంగా తరలించుకున్న విషయం తెలిసిందే. తుంగ భద్ర నుంచి కర్నూలు జిల్లాకు రావాల్సిన అరకొర నీటికి కూడా ఆ రాష్ట్రంలోని మోకా వద్ద కర్ణాటక రైతులు గండికొట్టారు. షట్టర్లు దించేసి నీటి సరఫరా నిలిపేశారు. ఇదేమిటని నిలదీసిన అధికారులపై, రైతులపై తిరగబడ్డారు.

English summary
Tension prevailed at Tungabhadra Low Level canal at Moka Regulator in Bellary district of Karnataka on Monday when the farmers downed the canal shutters and diverted the flow to local channels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X