కెసిఆర్కు నిరాశ కలిగిందేమో: కేంద్రంపై సుష్మాస్వరాజ్
నెలాఖరు నాటికి తెలంగాణ వస్తుందన్న కెసిఆర్కు కేంద్ర ప్రభుత్వ తీరు నిరాశ కలిగించి ఉంటుందని అన్నారు. ప్రత్యేకాంధ్ర కోసం ఆంధ్రా జెఏసి నాయకులు తనను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని.. వారు తెలిపిన అంశాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజానికి తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని.. తెలంగాణ ఏర్పడితే ఆంధ్రా కూడా ఏర్పడినట్లేనని అన్నారు.
రాజ్యసభలో తాము ప్రవేశపెట్టిన తెలంగాణ తీర్మానంపై చర్చ జరిగినా.. సర్కారు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. నెలాఖరుకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న కెసిఆర్కు ఇది తీవ్ర నిరాశ కలిగించి ఉంటుందన్నారు. కెసిఆర్ నెలాఖరు నాటికి తెలంగాణ అని అంటే.. కనీసం హోంమంత్రి రాజ్యసభలో ఏదైనా ప్రకటన చేస్తారేమోనని తామూ భావించామని.. కానీ ప్రభుత్వ తీరు మాత్రం నిరాశ కలిగించిందన్నారు. అనంతరం జైఆంధ్ర నేతలు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కూడా కలిశారు.