హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పక్కలో బల్లెం: టిజి వెంకటేష్, జగన్ కేసుపైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
గుంటూరు: చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం తెలంగాణ సమస్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై స్పందించారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో టిజి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ అంశం పక్కలో బల్లెంలా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విషయంలో మిగిలిన అన్ని పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చేశాయని అన్నారు.

ఆఖరుగా ఇప్పుడు ఈ బంతి కాంగ్రెసు కోర్టులోనే ఉందన్నారు. తమ పార్టీ దీనిపై జాప్యం చేయకుండా తొందరగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తమ పార్టీ తీసుకుంటుందని, అయితే అది త్వరగా ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణకు డార్జిలింగ్ తరహా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టిజి వెంకటేష్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఏమాత్రం ఉండదని, అవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టి పారేశారు. కృష్ణా నీటి విడుదల సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న నీటి పారుదల శాఖలో కొంత సిబ్బంది కొరత ఉందని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో లబ్ది పొందింది తండ్రి కొడుకులేనని జగన్, వైయస్‌ను ఉద్దేశించి అన్నారు. కానీ ఇప్పుడు ఈ కేసులో మంత్రులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Minister of Andhra Pradesh, TG Venkatesh said that Telangana is very sensitive issue. He hoped that Congress will take decision soon on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X