నరోడా కేసు: మాజీ మంత్రిని దోషిగా తేల్చిన కోర్టు
కొడ్నానీ గుజరాత్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. నరోడాలోలోని పారిశ్రామిక ప్రాంతంలో 2002 ఫిబ్రవరి 28వ తేదీన 97 మందిని ఊచకోత కోశారు. అందులో 94 మంది శవాలు దొరికాయి. మరో ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తేలలేదు. మొత్తం 94 మందిలో 84 మందిని గుర్తించారు.
నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో 47 మందిని పట్టుకుని చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్కు) అప్పగించింది. ఆ తర్వాత మరో 24 మందిని అరెస్టు చేశారు. వారిలో మాయా కొడ్నానీ కూడా ఉన్నారు. ఈ కేసులో మొత్తం 8 చార్జిషీట్లు దాఖలు చేశారు.
విచారణ 2009లో ప్రారభమై రెండేళ్ల పాటు కొనసాగింది. తేజాస్ పాఠక్, మోహన్ నేపాలీ బెయిల్ను జంప్ చేశారు. విచారణ జరుగతున్న కాలంలో 8 మంది నిందితులు మరణించారు. వారిలో ఒకరికి కేసు నుంచి విముక్తి లభించింది. వినోద్ మరాఠే ఇప్పటికీ పరారీలో ఉన్నారు.