గాలి బెయిల్ డీల్ సొమ్ముపై రంగంలోకి దిగిన ఈడి
గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన ఆదాయ మార్గాలు దాదాపుగా మూసుకుపోయిన తరువాత కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సమకూర్చగలిగారన్నదీ అంతుపట్టకుండా ఉంది. దీనిపై ఈడీ ప్రస్తుతం కూపీ లాగుతోంది. ఈ డీల్లో చివరగా చేతులు మారిన రూ.9.5 కోట్లు కర్ణాటక నుంచి హైదరాబాద్కు ఎలా చేరాయి? ఎక్కడి నుంచి సమకూర్చారు? అనే వివరాలను సేకరిస్తున్నారు.
సీబీఐ కోర్టు మాజీ జడ్జి పట్టాభిరామారావు మూడోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తదుపరి వాదనలు 31వ తేదీకి వాయిదా పడ్డాయి. బెయిల్ మంజూరు చేయాలంటూ డిఫెన్స్ ఇప్పటికే వాదనలు వినిపించింది. దీనిపై ఏసీబీ కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.
పట్టాభి రామారావుతో పాటు సోమశేఖర్ రెడ్డి, దశరథరామిరెడ్డి, సురేష్ బాబు, ఆదిత్య, రౌడీషీటర్ యాదగిరి బెయిల్ పిటిషన్లపై వాదనలు కూడా 31కి వాయిదా పడ్డాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తైన చలపతిరావు, రవిచంద్ర బెయిల్ పిటిషన్లపై వెలువరించాల్సిన తీర్పును జడ్జి ఎస్.జగన్నాధం అదే రోజుకు వాయిదా వేశారు.