మాకు స్పష్టత లేదు, మీకొండొచ్చు: తెలంగాణపై షిండే
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో జంతర్మంతర్ వద్ద మూడువేల మందితో భారీ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యాలయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షిండేతో తన భేటీ వివరాలు తెలియజేశారు. తెలంగాణ ఇస్తే లాభమా? ఇవ్వకుంటే లాభమా అని కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని, కాబట్టే ఆ పార్టీకి స్పష్టత లేదని విమర్శించారు. విభజన సమస్య కారణంగా రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని చెప్పారు.
దద్దమ్మ ప్రభుత్వాన్ని నడుపుతూ కిరణ్ నామ్కే వాస్తే సీఎంగా మిగిలారని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో తలపెట్టిన పార్టీ ధర్నా వివరాలను ఆయన వెల్లడించారు. తొలిరోజు లోక్సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రెండోరోజు సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, ముగింపు రోజున ఎన్డీఏ చైర్మర్ ఎల్కే అద్వానీ ధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. అలాగే ఎన్డీఏ కన్వీనర్ శరద్ యాదవ్ సహా పలువురు నాయకులూ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. కరువు, కరెంటు కోతలపై సీఎం కిరణ్..ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, షిండే శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఒక ప్రైవేటు హోటల్లో బస చేస్తారు. అదేరోజు రాత్రి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసానికి వెళ్తారు. తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం తర్వాత శ్రీకాళహస్తి చేరుకుంటారు.