పిలిప్పైన్స్లో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక
దాదాపు 32 కిలోమీటర్ల లోతు కేంద్రంగా భూకంపం చోటు చేసుకుంది.పిలిప్పైన్స్ జపాన్, ఇండోనేషియా, తైవాన్, పాపువా, న్యూ గయానా, ఇతర దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం విధ్వంసకరమైన సునామీకి దారి తీసే ప్రమాదం ఉందని, భూకంపం కేంద్రీకృతమైన కోస్తా తీరాలను, దూరంలోని కోస్తా తీరాలను సునామీ తాకవచ్చునని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం - రాత్రి 8. 50 గంటల ప్రాంతంలో వచ్చింది. ఈ భూకంపం అత్యంత తీవ్రమైందని, హోటల్ అతిథులు భయాందోళనలకు గురవుతున్నారని సంబంధిత వర్గాలంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, భూకంప తీవ్ర ఎంత ఉందో పరిశీలిస్తున్నామని చెబుతున్నాయి. నష్టానికి గానీ గాయాలకు గానీ సంబంధించిన సమాచారం అందలేదు.
ఆ తర్వాత జపాన్, తైవాన్లకు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు దేశాలు ఊరట పొందాయి. సునామీ అలలు హవాయిలోని అమెరికా తీరాన్ని తాకవచ్చునని అంటున్నారు. సమార్ దీవి తూర్పు తీరంలోని ప్రజలు తరలిపోవడం మంచిదని పిలిప్పైన్స్ సీస్మోలజీ హెడ్ రెనాటో సోలిడుమ్ చెప్పారు.