వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ లేకపోవడం బాధే: ఇడ్పులపాయలో వైఎస్ వివేకా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప: తన తండ్రికి నివాళులు అర్పించేందుకు తనయుడికి అవకాశం లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా వివేకా ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు.

వైయస్‌కు నివాళులు అర్పించేందుకు జగన్‌కు అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు. గత ఏడాది తమతో గడిపిన జగన్ ఈసారి లేకపోవడం తనను వ్యక్తిగతంగా కలచి వేస్తోందన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను జైలులో పెట్టించారని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. జగన్‌తోనే రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పడం చేతకానితనానికి నిదర్శనమన్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియాజకవర్గంలో వైయస్సార్ వర్థంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరి నియాజక వర్గంలో 150 వైయస్ విగ్రహలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి విగ్రహన్ని టిడిపి కంచుకోటగా ఉన్న చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మహిళలు సొంతంగా నిధులు సమీకరించి ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి మరీ వైఎస్‌ విగ్రహన్ని ప్రతిష్టించడం విశేషం.

English summary
YSR Congress party leader YS Vivekananda Reddy said that it is very unfortunate that YS Jaganmohan Reddy is no chance to tour at Idupulapaya on this day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X