పిఎంవో స్పందన-మొండికేసిన వాషింగ్టన్ పోస్టు డైలీ
ఆ అంశంపై పత్రిక క్షమాపణ చెప్పడానికి నిరాకరించిందని, రిపోర్టరు మాత్రం రెంెడు సార్లు క్షమాపణ చెప్పాడని ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయం తెలిపింది. అయితే, తాను రాసిన వార్తాకథనానికి కట్టుబడి ఉన్నానని వాషింగ్టన్ పోస్టు ఇండియా బ్యూరో చీఫ్, వార్తాకథనం రచయిత సిమోనే డెన్యూర్ అన్నారు. ప్రధాని కార్యాలయం కమ్యూనికేషన్స్ సలహాదారు పంకజ్ పచౌరి చేసిన ఫిర్యాదుకు ఆయన జవాబు ఇచ్చారు.
వెబ్సైట్ డౌన్ అయినందుకు మాత్రమే తాను క్షమాపణ చెప్పానని, ప్రధాని కార్యాలయానికి నేరుగా జవాబును పంపించలేకపోయిందని, సమస్య పరిష్కారం కాగానే జవాబును వారికి విషయం చెప్పానని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ జర్నలిస్టుకు ఉందని, దాని గురించి తాము అభ్యంతరం చెప్పడం లేదని, అనైతికమైన, వృత్తిపరమైన ప్రవర్తన లోపాన్ని ఎత్తు చూపుతూ మాత్రమే ఈ లేఖ రాస్తున్నామని పచౌరి డెన్యూర్కు రాసిన లేఖలో అన్నారు.
తమతో మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికీ డెన్యూర్ తమన సంప్రదించలేదని, అందువల్ల వార్తాకథనం ఏకపక్షంగా ఉందని ఆయన అన్నారు. వర్షాకాలం సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. మీరు రెండు సార్లు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత నేను చెప్పలేదని అంటున్నారని పచౌరీ అన్నారు.