విలీనంపై విజయమ్మ మనససులో ఏముందో: బొత్స
వైయస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో డైరీ రాశారా, లేదా అనేది ముఖ్యం కాదని, ఆ డైరీలో రాజశేఖర రెడ్డి అనుభవాలున్నాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి డైరీ ఆవిష్కరణ రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి చేసింది కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇచ్చే సమయంలో కూడా చంద్రబాబు యూ టర్న్ తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణపై కసరత్త జరుగుతున్న విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. సున్నితమైన అంశాలపై అందరితో చర్చిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు గత మూడు నెలలుగా మాట్లాడుతున్న మాటలను పరిశీలిస్తే పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని, చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పునాదులు పెకలిస్తామని చెప్పినవారు తిరిగి పార్టీలోకి వచ్చారని ఆయన అన్నారు.
కాంగ్రెసు శిథిలం కాలేదు, బీటలు వారలేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండో స్థానం ఎవరిదో మరోసారి చెబుతానని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించాలనే హైకోర్టు తీర్పుపై అపీల్కు వెళ్తామని ఆయన చెప్పారు. జనాభా లెక్కలు సేకరించడం ఇప్పుడు సాధ్యం కాదని ఆయన అన్నారు. బిసీ రిజర్వేషన్లను తగ్గించబోమని ఆయన అన్నారు.