'రాహుల్గాంధీపై రేప్ కేసు వెనుక అఖిలేష్ యాదవ్'
రాహుల్ గాంధీ ఓ బాలికను అక్రమంగా నిర్భంధించారంటూ కిషోర్ సమృతే కేసు పెట్టారు. సమృతే ఫిర్యాదును విచారించిన అలహాబాద్ హైకోర్టు అతనికి రూ.50 లక్షల రూపాయల జరిమానాను విధించడంతో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కిషోర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో గత ఏప్రిల్లో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది.
సోమవారం దీనిపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సమృతే లాయర్ జైశ్వాల్ తన వాదనలు వినిపిస్తూ... రాహుల్ పైన హైకోర్టుకు వెళ్లాలని పందారా రోడ్డు నుండి సూచనలు అందాయని చెప్పారు. పందారా రోడ్డు పై పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వాలని విచారణ జరుపుతున్న జస్టిస్ స్వతంత్ర కుమార్ లాయర్ను అడగటంతో అందుకు జైశ్వాల్ అతను ప్రస్తుత ముఖ్యమంత్రి అని పార్టీ నాయకుడు అని చెప్పారు.
సమృతే పందారా రోడ్డు నుండి అందిన సూచనల మేరకే అతను రాహుల్ పైన హైకోర్టుకు వెళ్లారన్నారు. ఇందుకు న్యాయమూర్తి సదరు వ్యక్తి ఎవరో తెలియదా అని ప్రశ్నించగా.. ప్రస్తుత సిఎం, పార్టీ నేత అని తాము సిబిఐకి ఈ స్టేట్మెంట్ ఇచ్చామని జైశ్వాల్ చెప్పారు. జైశ్వాల్ చెప్పింది యుపి సిఎం ముఖ్యమంత్రి పేరేనని అంటున్నారు.