వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయి హైదరాబాదులోని చంచల్‌గుడా జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్‌కు బెయిల్ ఇవ్వకూడదంతూ సీబీఐ తరఫున న్యాయవాది మోహన్ జైన్ తమ వాదనలు వినిపిస్తున్నారు.వైయస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్‌ను చదవాల్సి ఉందనే కారణంతో పిటిషన్ విచారణను వాయిదా వేసింది.

యితే ఇదే సమయంలో సీబీఐ తరఫున గతంలో వాదించిన న్యాయవాదులను ప్రభుత్వం మార్చి మోహన్ జైన్‌ను నియమించింది. కాగా, న్యాయవాదులను మార్చిన నేపథ్యంలో వాదనలు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి పరిశీలించేందుకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ శుక్రవారం మొదటి సారిగా కోర్టు వచ్చారు.

వైయస్ జగన్ మే 27వ తేదీన అరెస్టయ్యారు. గతంలో ఆయన పలుమార్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు తోసిపుచ్చాయి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే కొన్ని చార్జిషీట్లను దాఖలు చేసింది. మరిన్ని చార్జిషీట్లను దాఖలు చేసేందుకు సిద్ధపడుతోంది.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు ఇంకా జైలులోనే ఉన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అంటూ సిబిఐ జగన్‌కు బెయిల్ ఇవ్వరాదని కోరుతోంది.

English summary
Arfuements on YSR Congress president YS Jagan bail petiotion have begun in Supre,e Court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X