బొత్సకు సుప్రీంలో ఊరట: పిటిషనర్కు సూటి ప్రశ్న

పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ దాడుల్లో బొత్స, ఆయన కుటుంబ సభ్యులకు లిక్కర్ షాపులు న్నాయన్న వాస్తవం బయటపడిందని తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇందులో ప్రమేయం ఉందంటూ ఏసీబీ దాడుల నివేదిక పేర్కొందని గుర్తుచేశారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆ నివేదికను తన వద్ద పెట్టుకుని ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులను చెప్పుచేతల్లో ఉంచుకున్నారని ఆరోపించారు. తన రాజకీయ ప్రత్యర్థులపై మాత్రం దాడులు చేయించారన్నారు.
ఏసీబీ దాడుల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆజాద్, సోనియాకి బొత్స లేఖలు రాశారన్నారు. ఈ లేఖ రాసిన మూడు రోజులకే ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిని సీఎం ముఖ్యమంత్రి మా ర్చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో రా జ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్రం కూడా జోక్యం చేసుకోవటం లేదన్నారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా రామచంద్రరావు ఏదో అనబోతుండగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు జోక్యం చేసుకుంటూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అనుమతించబోమ న్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి జీతాలు తీసుకుంటోంది ప్రజల నుంచే కాబట్టి, వారు తప్పు చేస్తే ప్రజలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తారని చెబుతూ పిటిషన్ను తోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications