వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌విజయమ్మతో అసదుద్దీన్ భేటీ: వైయస్‌కు కితాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Asaduddin Owaisi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కితాబు ఇచ్చారు. మధ్యాహ్నం భేటీ అయిన అసదుద్దీన్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైయస్‌దేనని కొనియాడారు.

ప్రజా సమస్యలపై వైయస్ తక్షణమే స్పందించే వారని, వైయస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరుచూ తాను ఆయనతో సమావేశమయ్యే వాడినని, ఇప్పుడు వైయస్ విజయమ్మ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

మరోవైపు కర్నూలు, కడప జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఢప్తి చేసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి వరకు హామీ రాలేదన్నారు.

రైతులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ సంక్షోభంపై చర్చ సమయంలో కుట్ర పూరితంగా సభను వాయిదా వేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకుండా పోవడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు.

English summary
Hyderabad MP Asaduddin Owaisi has met YSR Congress party honorary president YS Vijyamma on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X