తెలంగాణ కోసం విప్ల లేఖ: సంతకం చేయని జగ్గారెడ్డి

కాగా శుక్రవారం నాలుగోరోజు సభ ప్రారంభమైన కాసేపటికే 10.15కు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు సభలో తీర్మానం ప్రవేశ పెట్టాలని నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి విద్యుత్ సమస్యలపై చర్చిద్దామని స్పీకర్ సభ్యులకు సూచించారు. సమావేశాలకు సహకరించాలని అధికార పార్టీ సూచించిది.
తీర్మానం ప్రవేశపెడితే సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. వారు ఎంతకూ పట్టు వీడలేదు. దీంతో స్పీకర్ సభను రెండోసారి గంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు స్పీకర్ నాదెండ్ల మనోహర్తో మంత్రులు శ్రీధర్ బాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి భేటీ అయ్యారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన చాంబరులో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
కాగా సమావేశాలను తెరాస అడ్డుకుంటే ఆ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేసే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని తెలుస్తోంది. సభకు ఈరోజు, శనివారం మాత్రమే మిగిలి ఉంది. ఇంత వరకు పట్టుమని పది నిమిషాలు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ఈ రెండు రోజులైనా చర్చ జరిపేందుకు తెరాస ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే విషయమై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications