ప్రేమించలేదని..: యువకుల ఘాతుకం, రేప్కు యత్నం
అందుకు నిరాకరించిన పద్మావతి అక్కడ నుండి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అతను ఆమెపై యాసిడ్ పోశాడు. యాసిడ్ బాలిక మొహంపై కాకుండా నడుం పైన, చేతుల పైన కొద్దిగా పడింది. దీంతో ప్రమాదం తప్పింది. పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కోయంబత్తూరులో గొంతు కోసిన ఉన్మాది
కోయంబత్తూరులో ప్రేమలో విఫలమైన ఓ యువకుడు 14 ఏళ్ల అమ్మాయిని హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అమ్మాయి కూడా తొమ్మిదో తరగతి విద్యార్థినే. కోయంబత్తూరులోని కొవై గణపతి ప్రాంతంలో ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న అభినయను అదే ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ అనే 21 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు.
అభినయ అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో వేణుగోపాల్ ఉన్మాదిలా మారి.. శనివారం మధ్యాహ్నం అభినయ ఒంటరిగా ఉండటం చూసి, ఆమెతో మాటలు కలిపి ఇంట్లోకి వెళ్లాడు. మొదట ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. విద్యార్థిని ప్రతిఘటించింది. అంతలో ఆమె తల్లి కూడా వచ్చినట్లుగా ఉన్మాది గమనించాడు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించాడు. కానీ ప్రాణాపాయం తప్పింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.