జగన్ సంగతేంటి: ధర్మానకు జూపూడి, మేళతాళాలతో...

ఏ తప్పు చేయకుండానే జైలులో ఉంటున్నందుకు జగన్ ఎంతగా బాధపడుతున్నారో ప్రజలకు తెలుసునన్నారు. మంత్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తే మంచిందన్నారు. ప్రభుత్వం బేషరతుగా జగన్కు క్షమాపణలు చెప్పి, జైలు నుండి విడుదల చేయించి.. మేళతాళాలతో ఆయన ఇంటి వద్ద వదిలి పెట్టాలన్నారు. తప్పు చేయలేదని మంత్రులు అంటుంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు ప్రభుత్వం ఎందుకు దీనిని చెప్పడం లేదన్నారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హైదరాబాదులో డిమాండ్ చేశారు. డిమాండును బట్టి ప్రభుత్వ సర్ ఛార్జీలు పద్ధతి కాదన్నారు. పేదలు, సామాన్యులపై తీవ్రమైన భారం పడుతుందని, 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడా తన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల ఎకరాలు ఎండిపోతుంటే ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందన్నారు.
పెరిగిన బస్సు ఛార్జీలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆర్టీసి ఛార్జీలు పెంచి, విద్యుత్ ధరలు పెంచి రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షిస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications