తిరిగి జైలుకు జగన్: ధర్మానకు విజయమ్మ పలకరింపు

YS Jagan - Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ వ్యవహారం కేసు విచారణనను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 9వ తేదికి వాయిదా వేసింది. వాన్‌పిక్‌కు భూములు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలతో కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈరోజు ముందస్తు బెయిల్ తీసుకున్నారు. వెంకట్రామి రెడ్డి, సత్యసాయిలు ఒక్కొక్కరు రూ.25వేల చొప్పున ష్యూరిటీ ఇచ్చారు. అక్టోబర్ 9న కోర్టుకు మరోసారి హాజరు కావాలని ఆదేశించింది.

వాన్‌పిక్ కేసుపై విచారణ వాయిదా పడిన అనంతరం జగన్ పిటిషన్ మేరకు కోర్టు అతనికి అరగంటపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించింది. దీంతో అతను తన తల్లి, పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, భార్య భారతి రెడ్డి తదితరులతో కాసేపు మాట్లాడారు. జగన్‌ను కలిసేందుకు చాలామంది వచ్చినప్పటికీ వారిని అనుమతించలేదు. అంతకుముందు కోర్టుకు వచ్చిన ధర్మానకు జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం జగన్‌ను తిరిగి జైలుకు తరలించారు. ధర్మాన, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలు కూడా కరచాలనం చేసుకొని పలకరించుకున్నారు. వైయస్ విజయమ్మ కూడా ధర్మానను నవ్వుతూ పలకరించారు. జగన్, ధర్మాన, మోపిదేవిలు కోర్టుకు రావడంతో కోర్టు వద్ద అంత కోలాహలం కనిపించింది. కోర్టులో ధర్మానను న్యాయమూర్తి పిలిచిన సమయంలో ఆయన నిందితులు నిల్చునే స్థానంలో ఉన్నారు. కోర్టు జగన్‌ రిమాండ్‌ను అక్టోబర్ 9వ వరకు పొడిగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+