బాలిక అక్రమ నిర్బంధం: రాహుల్పై నిరాధారమైన కేసు
విచారణకు సంబంధించిన నివేదికను సీల్ట్ కవర్లో కోర్టుకు సమర్పించారు. అక్రమంగా నిర్బంధానికి గురైనట్లు పేర్కొంటున్న వ్యక్తులు, బాలిక పేర్లు, చిరునామాలు తప్పని తేలిందని తెలిపారు. పిటిషన్లో పేర్కొన్న చిరునామాలను, వ్యక్తుల పేర్లను నగర పంచాయతీ, జిల్లా ఆహార పౌర సరఫరాల ఇన్స్పెక్టర్లతో సహా వివిధ ప్రభత్వ అధికారులు తనిఖీ చేయగా అవి అవాస్తవమని తేలిందని వివరించారు.
నిర్బంధించిన బాలికను, ఆమె బంధువులను కోర్టు ఎదుట హాజరుపర్చాలని కోరుతూ మధ్య ప్రదేశ్లో ఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిషోర్ నమ్రితే దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్కు నిధులు వేరే వారు సమకూర్చారని కూడా సిబిఐ తెలిపింది. దీనికి సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. వెబ్ సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకున్న సమాచారంపై ఆధారపడి నమ్రితె పిటిషన్ దాఖలు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు.
దీనికి సంబంధించి వారు విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని... విదేశాల్లో దర్యాఫ్తు చేపట్టేందుకు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పిపి రావు తన వాదనలను వినిపిస్తూ... యువ నాయకుడి రాజకీయ భవిష్యత్తుకు కళంకం ఆపాదించడానికి చేసిన కుటిల ప్రయత్నమని ఆయన ఆరోపించారు.