బిలావల్ ప్రేమలో హీనా: రబ్బిష్.. ఖర్కు భర్త మద్దతు

కాగా హీనా రబ్బానీ ఖర్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టోల మధ్య ప్రేమాయణం నడుస్తోందని బంగ్లాదేశ్కు చెందిన వీక్లీ బ్లిట్జ్ అనే టాబ్లాయిడ్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కథనం ప్రకారం.. పెళ్లి చేసుకున్నాక పాకిస్థాన్ వదిలి స్విట్జర్లాండ్లో స్థిరపడాలని ఈ జంట పథకం వేసిందట. కానీ, వీరి ప్రేమకథ జర్దారీకి ఏమాత్రం నచ్చలేదట.
తన కొడుకు కన్నా ఆమె వయసులో పదకొండేళ్లు పెద్దది కావడం.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండటం.. ఇవీ జర్దారీ నిరాకరణకు కారణంగా పేర్కొంది. బిలావల్ను భావి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆ దేశంలో చాలామంది భావిస్తారు. కానీ, ఈ పెళ్లితో బిలావల్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్దారీ బెంగపెట్టుకున్నారని వివరించింది.
ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు అయిన తన భర్త ఫిరోజ్ గుల్జార్ నుంచి విడాకులు తీసుకోవాలని, కూతుళ్లను భర్త దగ్గరే వదిలేసి.. బిలావల్తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని హీనా రబ్బానీ భావిస్తున్నట్టు పేర్కొంది. ఒకసారి వీరిద్దరూ పాకిస్తాన్ అధ్యక్ష భవనంలో అత్యంత సన్నిహితంగా ఉండగా జర్దారీకి దొరికిపోయారని కూడా రాసింది. బిలావల్ పుట్టినరోజు సందర్భంగా రబ్బానీ ఒక గ్రీటింగ్ కార్డు పంపిందని.. అందులో మన బంధం శాశ్వతమైనదని, మనం త్వరలోనే మనకు మనంగా ఉంటామని అని ఆమె చేతి రాతతో రాసి ఉందని తెలిపింది.
జర్దారీ ఎంత ప్రతిఘటిస్తున్నా హీనా రబ్బానీని పెళ్లాడాలని బిలావల్ కృతనిశ్చయంతో ఉన్నాడని.. ఇందుకోసం పిపిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడడం లేదని రాసింది. హీనా రబ్బానీ, ఆమె కూతుళ్లతో కలిసి స్విట్జర్లాండ్లో స్థిరపడతానని ఒకసారి, విడాకుల అనంతరం రబ్బానీ తన అమ్మాయిలిద్దరినీ భర్త దగ్గరే వదిలేస్తుందని మరోసారి జర్దారీకి బిలావల్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. వీరిద్దరి బంధాన్ని విడగొట్టేందుకు.. జర్దారీ ప్రభుత్వ యంత్రాంగాన్ని రబ్బానీ భర్త వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించినా ఫలితం లేకపోయిందట.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications