హైదరాబాద్లో టెన్షన్ టెన్షన్: ఓయులో బైక్ ర్యాలీకి చెక్

అడ్డుకుంటే జరగబోయే పరిణామాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తాము శాంతియుతంగా కవాతు నిర్వహిస్తామన్నారు. తాము ఎలాగైనా వేదిక వద్దకు చేరుకుంటామన్నారు. తాము పోలీసులు సూచించిన మాదిరిగా ఏడు గంటల వరకే కవాతు నిర్వహించమని, ఓపిక ఉన్నంత వరకు, తెలంగాణ వచ్చే వరకు అక్కడే కూర్చుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ఓయు ఎన్సిసి గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వమే తూట్లు... కోదండరామ్
కవాతుకు తరలి వచ్చే తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. కవాతుకు అనుమతి ఇచ్చి ప్రభుత్వం మళ్లీ అరెస్టులు, అడ్డుకోవడాలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందన్నారు. తెలంగాణ జిల్లాల్లో రాత్రి నుండి విద్యుత్ను కట్ చేశారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యయుతంగా కవాతు నిర్వహిస్తామని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. తాము ఏడు గంటల వరకు కూర్చుంటామని చెప్పలేదని, ఓపిక ఉన్నంత వరకు కవాతు నిర్వహిస్తామన్నారు. జెఏసి కార్యాచరణను సాయంత్రం ప్రకటిస్తామన్నారు. గౌరవం లేని స్థానానికి తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి వెంటనే ప్రజల్లోకి రావాలని సూచించారు. కవాతుకు ప్రజలు రాకుండా బస్సులు, రైళ్లను నిలిపివేశారన్నారు. అడ్డుకుంటే ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
తెలంగాణవాతుల అరెస్టుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రజా గాయకుడు గద్దర్, భారతీయన జనతా పార్టీ, తెలంగాణ ప్రాంత ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ, సచివాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండువైపుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలకు మినహా ఎవరికీ అనుమతించకుండా ఆంక్షలు పెట్టారు. మరోవైపు తెలంగాణ జిల్లాల నుండి తరలి వస్తున్న తెలంగాణవాదులను పలువురిని పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణవాదులు ప్రయివేటు వాహనాల్లో తరలి వస్తున్నారు.
తెలంగాణవాదులను అరెస్టు చేయం.. దినేష్ రెడ్డి
తెలంగాణవాదులను తాము అరెస్టు చేయడం లేదని డిజిపి దినేష్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామన్నారు. ప్రజలు ఆగ్రహావేశాలకు గురి కావద్దని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు. తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేయరన్నారు. శాంతియుతంగా కవాతు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications