సల్మాన్ స్టంట్ చేయబోయి ఉసురు తీసుకున్న బాలుడు

పదో తరగతి చదువుతున్న అతను గోల్డెన్ చార్యోట్ మీదికి ఎక్కాడు. ఆ రైలు నుంచి దుమికే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతను ప్లాట్ఫారంపై పడిపోయాడు. తల మొదటి ప్లాట్ఫారానికి తాకింది. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఏక్ థా టైగర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఏ విధంగా రైలు నుంచి దుమికాడో చేసి చూపించాలని అతను అనుకున్నాడు.
పార్కు చేసి ఉన్న రైలు పైకి ఎక్కిన మిగతా మిత్రులు అతన్ని ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. రైలు ఎక్కిన తర్వాత ఫైజాన్ హైటెన్షన్ వైర్లకు దగ్గరగా వచ్చాడని, దాంతో ప్రమాదం సంభవించిందని అంటున్నారు. రైల్వే పోలీసులు వచ్చే లోగానే మిగతా మిత్రులు పారిపోయారు.
రైల్వే పోలీసులు అంబులెన్స్ తెప్పించి ఫైజాన్ను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని శివాజీనగర్ న్యూ బాంబూ బజార్లో హోటల్ నడుపుతున్న ఫైజాన్ తండ్రి ముస్తాఖ్ అహ్మద్కు చేరవేశారు. విక్టోరియా ఆస్పత్రి నుంచి అతన్ని వైద్యుల సలహా మేరకు నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తలకు తగిలిన గాయాలకు చికిత్స పొందుతూ ఫైజాన్ శుక్రవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మరణించాడు.












Click it and Unblock the Notifications