ఆ మూడు సాకు: తెలంగాణపై టిజి, కవాతుపై పరకాల
కేవలం రాజ్యాధికారం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని చేస్తున్నారని ఆరోపించారు. తమ మొదటి నినాదం సమైక్యాంధ్రనే అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా కర్నూలు ఉండి ఉంటే రాయలసీమ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ఇప్పుడు హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మూడు సమస్యలు చూపించి అడుగుతున్నారని, కానీ అది ఇప్పుడు లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.
మార్చ్ తుస్సుమంది... పరకాల ప్రభాకర్
గత నెల 30వ తేదిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ కవాతు తుస్సుమందని విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్ అన్నారు. ఐకాస చెప్పినట్లుగా కవాతులో లక్షలాదిమంది పాల్గొనలేదన్నారు. కేవలం ముప్పై వేల మంది మాత్రమే పాల్గొన్నారని, సాయంత్రానికి కేవలం 1500 మంది మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులను దూషించడం సరికాదన్నారు.
రాష్ట్ర విభజన కోసం చేస్తున్న వాదనలు సత్యదూరమన్నారు. దానిని నిరూపించేందుకే విశాలాంధ్ర కృషి చేస్తోందన్నారు. విభజనవాదులు విడిపోవడానికి ఒక కారణం చెబితే కలిసి ఉండటానికి తాము వంద చెబుతామన్నారు. ఏ ప్రాంతంలో చర్చ ఏర్పాటు చేసినా సిద్ధమన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రాయలసీమ వెనుకబడి ఉందన్నారు.