కోపంలో రెండ్రోజుల పసిపాపని నేలకేసి కొట్టిచంపిన తండ్రి
దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కోపంలో అలా చేశానని, చంపాలనే ఉద్దేశ్యంతో చేయలేదని తండ్రి వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు చేశారు. తాను చేసిందే తప్పేనని, గొడవ కారణంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కోపంలో అలా చేశానని అన్నారు. కాగా కూతురు పుట్టిందని చంపి ఉంటారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కరుణాకర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విదేశాలలో ఉద్యోగం పేరుతో మోసం
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడిలో ఒక వ్యక్తి విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేశాడు. ఈ మేరకు 20 మంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఇరవై వేల రూపాయలు చొప్పున తీసుకొని మోసం చేశాడని వారు ఆరోపించారు.