పరువు నష్టం దావా: షీలా దీక్షిత్కు కోర్టు షాక్
షీలా దీక్షిత్ నవంబర్ 9వ తేదీన తమ ముందు హాజరు కావాల్సిందేనని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నవనీత్ బుధిరాజా ఆదేశించారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే సాకుతో కోర్టుకు హాజరు కావడంపై నుంచి మినహాయింపు ఇవ్వాలని షీల్ దీక్షిత్ చేసిన విజ్ఞప్తిపై విజేందర్ గుప్తా తరఫు న్యాయవాది అనిల్ సోనీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేశారు. కేసుతో సంబంధం లేని న్యాయవాదులు, ఇతరులు హాల్ బయటకు వెళ్లిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు తరఫు న్యాయవాదులు కోరడంతో న్యాయమూర్తి ఆ ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ఎన్నికల సమయంలో షీల్ దీక్షిత్ తనపై అనాగరికమైన బాషలో తిట్టారని విజేందర్ గుప్తా ఆరోపించారు. గుప్తా తనను విలన్, వ్యాంప్గా అభివర్ణించినట్లు షీలా దీక్షిత్ ఫిర్యాదు చేశారు. తాను ఢిల్లీ ప్రజలను మోసం చేశారని అన్నారని ఆమె ఫిర్యాదు చేశారు. గుప్తాకు వ్యతిరేకంగా షీలా దీక్షిత్ మే 30వ తేదీన వాంగ్మూలం ఇచ్చారు.