నేతల పాదయాత్రలపై ఎంపి జయప్రద హాట్ కామెంట్స్
దీనిపై విలేకరులు ప్రశ్నించగా జయప్రద స్పందించారు. పాదయాత్రలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. పాదయాత్రలతో ఒరిగేదేమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. పాదయాత్రల వల్ల తమకు ఏమైనా లాభం జరుగుతుందా లేదా అని ప్రజలు నిర్ణయించుకోవాలని ఆమె సూచించారు.
కాగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు పలువురు పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మూడోసారైనా పవర్లోకి రావానే ఉద్దేశ్యంతో ఉంది. ఇందుకోసం పార్టీలో నూతనోత్తేజం తీసుకు వచ్చేందుకు, పార్టీలో విశ్వాసం కలిగించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారు.
కొత్తగా పుట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు కేవలం సెంటిమెంట్తో కాలాన్ని నెట్టుకు వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల వరకు ఆ సెంటిమెంటును అలాగే ఉంచుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు.