సిఎం బిజీ బిజీ: రాహుల్తో కిరణ్, ప్రధానితో యువనేత
ముఖ్యమంత్రి మధ్యాహ్నం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్తో కిరణ్ రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి, తెలంగాణ ప్రభావం తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. అంతకుముందు కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్తో కిరణ్ భేటీ అయ్యారు.
నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుమతించాల్సిందిగా కిరణ్ ఆయనను కోరినట్లుగా సమాచారం. ఇప్పటికే ఆజాద్, రాహుల్తో భేటీ అయిన కిరణ్ ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు వాయలార్ రవి, అహ్మద్ పటేల్లతో భేటీ కానున్నారు.
రాహుల్తో భేటీ ముగిసన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. మరోవైపు కిరణ్తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యారు. ఆయన కేంద్రమంత్రివర్గ విస్తరణపై ప్రధానితో చర్చించినట్లుగా సమాచారం.
వీరప్ప మొయిలీతో వివేక్
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు.