వాద్రా సరే సోనియా: కేజ్రీవాల్కి స్వామి, మోడీకి కితాబు
రాబర్ట్ వాద్రా అక్రమాలకు పాల్పడేందుకు ఎవరిని ఉపయోగించుకుంటున్నారు, ఆయనను ఎవరు ప్రభావితం చేస్తున్నారో ఎందుకు బయటకు చెప్పడం లేదని ప్రశ్నించారు. మీడియాకు ఎక్కి ప్రజల నుండి మార్కులు కొట్టేసేందుకే కేజ్రీవాల్ ఇలా చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అదే కాకుంటే కోర్టుకు వెళ్లవచ్చు కదా అని చెప్పారు. కేజ్రీవాల్ తన రాజకీయ పునాదుల కోసమే ఇలా చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.
లౌకికవాదిని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యల పైనా ఆయన స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి లౌకికవాదే అన్నారు. అందుకే ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారన్నారు. హిందువులందరూ లౌకికవాదులేనని, మోడీ హిందుత్వ సిద్దాంతాన్ని నమ్ముతారని, హిందువులకు లౌకికవాదం పుట్టుకతోనే వస్తుందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు.
సిబిఐ ఉచ్చు నుండి తప్పించుకోవడానికే ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసుకు కొమ్ముకాస్తున్న పార్టీలు గల్లంతు కావడం ఖాయమన్నారు. ప్రభుత్వ స్థిరంగా ఉన్నంత కాలం కొందరు మద్దతు పలుకుతారని, పడిపోతుందని తెలిస్తే ఉపసంహరించుకోవడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు.