వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.890 కోట్ల నష్టం: యడ్డీకి సిబిఐ షాక్, ఛార్జీషీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్పకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) షాక్ ఇచ్చింది. గనుల అక్రమ తవ్వకాలకు ప్రోత్సాహం, నిబంధనలకు విరుద్ధంగా భూముల ఢీ నోటిఫికేషన్ కేసుల్లో యడ్యూరప్పతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడితో సహా మొత్తం పదమూడు మందిపై సిబిఐ మంగళవారం ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది.

యడ్డీ బిజెపితో తెగతెంపులు చేసుకొని కొత్త పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో సిబిఐ అతనికి పెద్ద షాక్ ఇచ్చింది. జిందాల్ కంపెనీకి గనుల కేటాయింపులో వీరు అక్రమాలకు పాల్పడ్డారని, తద్వారా యడ్యూరప్ప కుటుంబానికి రూ.20 కోట్ల మేర ముడుపులు అందాయని అందులో సిబిఐ పేర్కొంది.

భూముల డీనోటిఫికేషన్‌లో రూ.20 కోట్లు ముట్టాయని చెప్పారు. యడ్యూరప్ప అవినీతివల్ల రాష్ట్ర ఖజానాకు రూ.890 కోట్లదాకా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే యడ్డీ, ఆయన కుమారులు ముందస్తు బెయిల్ పొందడం, దీని రద్దుకు సుప్రీం కోర్టులో సిబిఐ ప్రయత్నించి విఫలమవడంతో వీరి అరెస్టుకు అవకాశాలు లేవని భావిస్తున్నారు.

English summary
The former Chief Minister of Karnataka BS Yeddyurappa, who is all set to launch his new party after resigning from Bharatiya Janata Party (BJP), seems to have been cornered once again on Tuesday, Oct 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X