రాహుల్ గాంధీపై రేప్ కేసును కొట్టేసిన సుప్రీం
ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసిన ప్రయత్నానికి గాను రాహుల్ గాంధీకి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవని జస్టిస్ బిఎసల్ చౌహాన్,త జస్టిస్ స్వతంతర్ కుమార్లతో కూడా సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.
కిశోర్ స్మృతే 2011లో వేసిన పిటిషన్ స్వచ్ఛతా బుద్ధితో వేసింది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణలు రాహుల్ గాంధీకి ప్రజల్లో ఉన్న ప్రతిష్టను దెబ్బ తీశాయని చెప్పింది. ఓ వెబ్సైట్ వార్తాకథనాన్ని ఆధారం చేసుకుని స్మృతే రాహుల్ గాంధీ, ఆయన మిత్రులకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
అమేథీలో రాహుల్ గాంధీ, ఆయన మిత్రులు 2006 డిసెంబర్ 3వ తేదీన ఓ బాలికను అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ వెబ్సైట్లో వార్త వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని స్మృతే పిటిషన్ వేశారు. తనపై బురద చల్లడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని రాహుల్ గాంధీ అంతకు ముందు కోర్టుకు చెప్పారు.