రఘువీరాపై షర్మిల ఫైర్, జగనన్న రాకుండా కుట్ర
మిగిలిన ఐదు శాతం పనులకు పాదయాత్ర అంటూ రఘువీరారెడ్డి బిల్డప్ ఇస్తున్నారని, హంద్రీనివా ప్రాజెక్టు మొదటి దస ఫనులను వైయస్ రాజశేఖర రెడ్డి 95 శాతం పూర్తి చేశారని చెప్పారు. గత మూడేళ్లలో ప్రాజెక్టుకు అవసరమైన 45 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిఎబీర్ ప్రాజెక్టుకు 10 టిఎంసిల నీటిని వైయస్ రాజశేఖర రెడ్డి కేటాయిస్తే దాన్ని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ఆమె అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తమ కుర్చీలను కాపాడుకునే పనిలో పడ్డారని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించే 108 వాహనాలు ఇప్పుడు నడవడం లేదని షర్మిల అన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం తెలుగుదేశం నిద్ర పోతోందని ఆమె వ్యాఖ్యానించారు. తన సోదరుడు వైయస్ జగన్ బయటకు రాకుండా తెలుగుదేశం, కాంగ్రెసు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆమె ఆరోపించారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను విమర్శిస్తూ షర్మిల పాదయాత్ర సాగుతోంది. ముందు చంద్రబాబు, వెనక షర్మిల అన్నట్లుగా పాదయాత్రలు సాగుతున్నాయి.